శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం - 18.05.2018
11 రోజుల పాటు ఆలయ కమిటి ఆద్వర్యం ఘనంగా నిర్వహించిన శ్రీ శత చండి మహా యాగం
పూర్ణ హుతి తో పరిసమాప్త మైంది. ఈ మహా యాగం ఆలయ పూజారి శ్రీ జనార్ధన్ శర్మ గారి నేతృత్వం లో ఇతర పండితుల సమక్షం లో ఘనంగా ముగిసింది.
నిర్వాకులు ఆలయ ప్రాంగణం లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సాయత్రం 6 గంటల కు కుంకుమార్చన, పార్వతి పరమేశ్వరుల కళ్యాణం వైబవంగా జరిగింది. శ్రీ విజయ దుర్గ దేవికి మహా మంగళ హారతి తో కార్యక్రమాలు పూర్తి గా పరిసమాప్తమైనవి. ఈ కార్యక్రమం లో అనేకమంది భక్తులు పాల్గొన్నారు.
Post a Comment