మాఘమాస మండల దీక్ష పారాయణం – Magha Masa Mandala Deeksha Parayanam - 2024
మాఘమాస మండల దీక్ష పారాయణం – 10.02.2024
శ్రీ లలితా సహస్ర నామ మండల దీక్ష
పారాయణం – 2024
(తేదీ:10-02-2024 నుండి 20-03-2024 వరకు)
అందరికీ నమస్కారం...
లోక కళ్యాణార్ధం, స్త్రీల అఖండ సౌభాగ్యం
మరియు మన:శ్శాంతి కొరకు శ్రీ లలితా సహస్ర
నామ పారాయణంతో కుంకుమార్చన...
శ్రీ శ్రీ శ్రీ విజయ దుర్గా మల్లేశ్వర స్వామి
దేవాలయానికి విచ్చేయుచున్న భక్తులకు ఇదే మా ఆహ్వానం – శుభాభివందనాలు...
పాటించవల్సిన నియమ నిబంధనలు
Ø సాయంత్రం పారాయణ
సమయం 6.30 ని,, నుండి 7.30 ని,, వరకు.
Ø ఉదయం పారాయణ
సమయం 8.00 గం,, నుండి 12.00 వరకు.
Ø నిదానంగా
అక్షర దోషాలు లేకుండా, ఒకరి నొకరు అనుసరిస్తూ ఒకే శృతి లో చదవండి.
Ø అర్థవంతంగా
చదివే ప్రయత్నం చేయండి.
Ø పారాయణం
ప్రారంభం అయిన తర్వాత వచ్చిన వారు ముందు వారి పారాయణాన్ని అనుసరించాలి అది పూర్తి
అయిన తర్వాత అందరు కలసి మొదటి నుంచి ప్రారంభించాలి.
Ø అనుసరించిన
పారాయణాన్ని లెక్క లోకి తీసుకోరాదు.
Ø మీకు ఎలా
వీలైతే అలాగా ఉదయం కానీ సాయంత్రం కానీ పారాయణం లో పాల్గొనవచ్చు.
Ø ఉదయం వచ్చిన
వారు సాయంత్రం రావచ్చు.
Ø ప్రతి
ఒక్కరు ఇక్కడ ఉన్న రిజిస్టర్ లో తప్పకుండా ఎన్నిసార్లు పారాయణం చేశారో రాయాలి.
Ø స్త్రీ, పురుషులందరు పాల్గొనవచ్చును.
Ø సాంప్రదాయ
దుస్తులు ధరించాలి.
శ్రీ శ్రీ శ్రీ
విజయ దుర్గా దేవి కృప కు పాత్రులు కాగలరాని మనవి...
- ఆలయ కమిటీ
Post a Comment