Nivedana - నివేదన - 08.02.2024

శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం

విజయ దుర్గా నగర్ కాలనీ, RCI రోడ్, బాలాపూర్, హైదరాబాద్ – 05

959 / 2011

ఈ నివేదికను ఆలయ కమిటీ చైర్మెన్ శ్రీ గాజుల తిరుపతి గారు నివేదించారు, అంతకు ముందు కమిటీ కోశాధికారి కామరాజు హరి ప్రసాద్ ప్రతిపాదించిన ఈ నివేదీకను కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.

 

నివేదన

మా ఆహ్వానాన్ని మన్నించి మన దేవాలయానికి విచ్చేసిన...

శ్రీమద్ద్ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ శంకర భారతి మహాస్వామి వారికి  ఇదే మా స్వాగతం సుస్వాగతం..

వారి పాదపద్మాలకు ప్రాణమిల్లుతూ...

దేవాలయ కమిటీ తరపున ఆలయం గురించి ..

శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం నిర్మాణము 2014 సం,,లో జరుపుకొని దిన దిన అభివృద్దితో శ్రీ శోభకృతు నామ సంవత్సరం పాల్గుణ మాసం లో అమ్మవారి కృపతో దశమవార్షికోత్సవం జరుపుకోబోతున్నాం... అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము...

అమ్మవారి ఆలయ శంకుస్థాపన శ్రీ వికృతి నామ సంవత్సర చైత్ర మాస శుద్ధ సప్తమి (22.03.2010) రోజున జరిగినది...

అమ్మవారి అనుగ్రహం, కమిటీ ఛైర్మన్ శ్రీ గాజుల తిరుపతి గారు మరియు  కమిటీ సభ్యుల సంకల్పం, కమిటీ సభ్యులైన శ్రీ వేణు గోపాల్ రావు గారి కృషి ఆలయ అభివృద్దిలో ఎంతగానో ఉన్నది. ఎంతో మంది ధాతలు, భక్తుల సహాయ సహకారాలతో ఎన్ని ఆటంకాలు వచ్చిన అవలీలగా ముందుకు సాగుతూ ఆలయ నిర్మాణం జరుపుకున్నాము.

శ్రీ విజయ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి  (12.03.2014) రోజున శ్రీ శ్రీ శ్రీ విజయదుర్గా దేవి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

ఈ చుట్టు ప్రక్కల 5 కిలోమీటర్ల పరిధి లో అమ్మవారి ఆలయం లేదు

ఆలయ ప్రాగణం లో...

శివ పంచాయతనం

నవగ్రహాది దేవతలు

తెలంగాణ రాష్ర్టం లో  ఏ దేవాలయం లో  లేని విధంగా ఈ ఆలయ ప్రాంగణంలో  క్షేత్ర పాలకులుగా శ్రీ గజముఖ ఆంజనేయ స్వామి  ఉన్నారు...

గో రక్షణకై కంకణం కట్టుకొన్న ఆలయ కమిటీ  గోశాలను నిర్వహిస్తున్నది... కమిటీ సభ్యులైన

శ్రీ వెంకట సత్యనారయణ గారి కృషి గోశాల అభివృద్దికి ఎంతగానో దోహద పడుతున్నది ...

ఈ ఆలయం లో జరుగు వివిధ  కార్యక్రమాలు:

హిందూ సనాతన ధర్మం కాపాడే విధంగా దానికి మావంతు కృషిగా... ఆలయ అర్చకులు శ్రీ జనార్ధన్ గారి ఆధ్వర్యం లో 12 సంవత్సరాల లోపు బాల బాలికలకు  శ్రీ లలితా సహస్త్ర నామ పారాయణం మరియు శ్రీ విష్ణు సహస్త్ర నామ పారాయణం నేర్పించటం జరుగుచున్నది... భగవద్గీత నేర్పించాలి అనే సంకల్పం తో ఉన్నాము.  ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకు వెళ్ళాలనే కృత నిశ్చయం తో ఈ ఆలయ కమిటి  ఉన్నది.  అని చెప్పడానికి గర్వ పడుతున్నాము.

ప్రతి నెల అమవాస్యకు శ్రీ చండీ హోమాన్ని శ్రీ సునీల్ శర్మ గారి ఆధ్వర్యం లో నిర్వహించు కొంటున్నాము.

ప్రతి నెల పౌర్ణమికి శ్రీ సత్య నారయణ స్వామి వారి వ్రతమును సామూహికంగా జరుపు కుంటున్నాము.

అమ్మవారి వార్షికోత్సవం 3 రోజుల పాటు నిర్వహిస్తాము, ఈ సందర్భంగా హోమాలు...

శ్రీ పార్వతి పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా అశేష భక్తజన సందోహం మధ్య జరుపుకుంటాము.

దసరా నవరాత్రులలో అమ్మవారు వివిధ అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తారు.

శ్రీరామ నవమి రోజున సీతా రాముల కళ్యాణం తో పాటుగా శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరుపుకుంటాము.

 శివరాత్రి పండుగ రోజున ప్రదోష వేల అభిషేకాలు అర్చనలు నిర్వహిస్తాము. లింగోద్భవ కాలం లో రుద్రాభిషేకం అశేష భక్తాదుల మధ్య శివ నామ స్మరణం తో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతుంది.

కార్తీక మాసోత్సవాలు కార్తీక దీపాలతో ఆలయ ప్రాంగణం దేదీప్య మానంగా వెలిగి పోతుంది.

 అమ్మవారికి వాహన సేవలు నిర్వహించాలనే తలంపుతో గజ వాహనం, హంస వాహనం సమకూర్చుకున్నాము... వృషభ, సింహ వాహనాలు త్వరలో ఆలయాని కి చేరుకోబోతున్నాయి... అని చెప్పడానికి సంతోషిస్తున్నాము.

జనవరి 22 వ తేదీన  శ్రీ రామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేడుక గా నిర్వహించుకున్నాము. మొదటి సారిగా శ్రీ సీతా రామ చంద్రుల వారిని గజ వాహనం పై విజయ దుర్గా నగర్ కాలనీ తో పాటుగా  అనుబంధ  కాలనీలు అయినటువంటి  సూర్య టౌన్ షిప్, వివేకానంద నగర్, చైతన్య నగర్ కాలని వాసుల సహకారం తో ఊరేగింపును ఘనంగా నిర్వహించు కొన్నాము.

తేదీ 10.02.2024 శనివారం రోజు నుండి శ్రీ రాజ శ్యామలా దేవి నవరాత్రులను నిర్వహించ తలపెట్టాము.

10 వేల సార్లు శ్రీ లలితా సహస్రనామ పారాయణం తేదీ 10.02.2024 నుండి 20.03.2024 మండల కాలం (41 రోజులు) నిర్వహించ తలపెట్టాము.

ఈ ఆలయ అభివృద్ది మరియు విస్తరణలో భాగంగా ఆలయానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయ సకల్పించాము.  

ఇటువంటి సంకల్పాలకు శ్రీ జగద్గురువుల అనుగ్రహాన్ని ఆశిస్తున్నాము.

ఇలాంటి కార్యక్రమాలను మీ ఆశీస్సులతో మునుముందు ఎన్నో  నిర్వహించు కోవాలని ఆశిస్తూ...

ఇక్కడ వచ్చిన భక్తులకు కృతజ్ఞతలు తెలుపుతూ...

శ్రీమద్ద్ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ శంకర భారతి మహాస్వామి వారి పాద పద్మాలకు ప్రాణమిల్లుతూ...

ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి... నమస్కారం ...








No comments